ఎల్లో మీడియా అనడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి నూటికి నూరు శాతం అర్హత సాధించాయి. ఈ రోజు ఆ రెండు పేపర్ల ఏపీ ఎడిషన్లను చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శిస్తున్నట్టుగా ఎల్లో మీడియా అని నిర్దారణ చేసుకోవచ్చు. కందుకూరులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో తొక్కిసలాట జరిగింది. ఎనిమిది మంది చనిపోయారు. అంతమంది చనిపోతే ప్రాధాన్యం ఇవ్వకుండా ఇచ్చామా..? అంటే ఇచ్చామూ అన్నట్టుగా కవరేజీ ఇచ్చారు. ఈనాడులో ‘తీవ్ర విషాదం’ హెడ్డింగ్తో,ఆంధ్రజ్యోతిలో ‘పెను విషాదం’ హెడ్డింగ్తో వార్తను అచ్చేశారు. ఈ వార్తకు సరి సమానంగా ప్రధాని మోదీని సీఎం జగన్ అప్పు అడిగిన వార్తను ఇచ్చారు. ఆంధ్రజ్యోతి అయితే మరీనూ ‘శ్రీమంత సీఎం’ హెడ్డింగ్తో జగన్ వార్తను ఇచ్చారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి 400 రోజులు 4 వేల కిలో మీటర్ల లోకేశ్ పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ వార్తను ఇచ్చారు. తీవ్ర విషాదం వార్తకంటే పోస్టర్ ఆవిష్కరణ వార్తకే ఈనాడు ప్రాధాన్యం ఇచ్చింది. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వాస్తవానికి పోస్టర్ ఆవిష్కరణ, అప్పు కోరిన వార్తలకు ఇంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. లోపలి పేజీల్లో వేసుకోవచ్చు. కానీ చంద్రబాబు అంటే ఈ రెండు పేపర్లకు మహా ఇష్టం కాబట్టి.. ఇలా తమకు తామే ఎల్లో మీడియా అని ప్రకటించేసుకున్నాయి. ఇదే సంఘటన జగన్ సభలోజరిగితే నా సామిరంగా ఈ రెండు పేపర్ల కవరేజీ తీరే వేరే ఉండేది. యాడ్స్ వచ్చినా వేయకుండా పరిచేసేవీ. ఇక సాక్షి విషయానికొస్తే కవరేజీలో ఆ పేపర్ ‘షో’క సంద్రం’ హెడ్డింగ్ పెట్టడంతో పాటు కూలి కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారంటూ రాసుకొచ్చి పరువు పోగోట్టుకుంది. ఏ పార్టీ మీటింగ్ పెట్టినా.. కూలి ఇస్తేనే సభలకు జనం వచ్చేట్టుగా చంద్రబాబే చేశారు. ఇప్పుడు అన్ని పార్టీలూ ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు. చివరకు ఆందోళన కార్యక్రమాలైన సరే.


