రాజకీయ నాయకుల మాటల కంటే గల్లీ జనాల మాటలు బెటర్ అని ఊరకే అనలేదు. ఇది వరకు వీధి నల్లాలు ఉన్నప్పుడు ఆడోళ్లు నెత్తులు పట్టుకొని కొట్టుకొంటూ నోటికొచ్చిన బూతులు విసిరేవాళ్లు. ఆ తర్వాత మగవాళ్ల రంగ ప్రవేశం. ఇక న బూతో న భవిష్యత్ అన్నట్టుగా ఉండేదీ. రాను రాను ఇదే వాడుక భాష అయింది. పైగా తెలంగాణ వాళ్లు ఇట్లనే మాట్లడతరని ఈ రాజకీయ నాయకులు చెప్పడం. పేపర్లలో కూడా అట్లనే రాసేస్తున్నరు.ఇప్పటి విషయానికొస్తే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ‘సీఎం కేసీర్ ముఖం మీద ఢిల్లీలో ఉంచుతరు’ అంటూ కామెంట్ విసిరాడు. దీనికి వెనుకా ముందు ఏంటంటే.. యాదాద్రి భువనగిరి జిల్లాలో బస్వాపురం రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. దీనికింద బీఎన్ తిమ్మాపురం మునిగిపోతోంది. పరిహారం కోసం ఆ ఊరు వాళ్లు బస్వాపురం రిజర్వాయర్ పనులు ఆపి.. నెల రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల వద్దకు వచ్చిన ఎంపీ కోమటిరెడ్డి ‘‘దేశం కోసం బీఆర్ఎస్ పార్టీ పెట్టానని సీఎం కేసీఆర్ చెబుతున్నరు. రూ. 350 కోట్ల కోసం ఎంపీనైన తాను ఈ కట్ట మీదే పడుకుంటే నీకు బుద్ది ఉందా అని ఢిల్లీలో కేసీఆర్ ముఖం మీద ఊస్తరు”అని అన్నారు. ఈ కామెంట్వెనుక ఉన్న సీన్ ఇదే. ఈ ముఖం మీద ఊంచేస్తరు అని అనకుండా కూడా మాట్లాడవచ్చు. కానీ రాజకీయాలు కదా ఇలానే మాట్లాడిస్తాయి.