ఒక్క క్షణం కళ్లు మూసుకోండి. ఇప్పుడు 70 ఏండ్లున్న మధ్య తరగతి వ్యక్తి చిన్న తనాన్ని గుర్తు చేసుకుంటే.. కరెంట్ లేకుండా గ్యాసు నూనెతో మిణుకు మిణుకుగా వెలిగే గుడ్డి దీపం వెలుగు కన్పిస్తోంది. ఫోన్ సౌకర్యం లేకుండా.. చావు,బతుకుల సమాచారం రావాలంటే మనిషే రావాలి. అది వస్తే సైకిల్పై లేకుంటే నడిచి. ఇప్పుడు ఇలా బతకగలమా..? ఇవన్నీ కాదు కానీ కరెంట్, ఫోన్ అందునా స్మార్ట్ ఫోన్ లేకుండా బతకగలమా..? కష్టమే. మామూలు కష్టం కాదు. వెరీ వెరీ కష్టం. మనమింత కష్టమని అనుకుంటున్న జీవితాన్ని కొన్ని కుటుంబాలు అలవోకగా కొనసాగిస్తున్నాయి. అది కూడా ఎప్పుడో కాదు.. ఈ 2022లోనూ. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం పరిధిలోని అంతకాపల్లి అడవుల్లోని కూర్బ గ్రామం వెళితే చాలు. ఓ వందేళ్లు వెనక్కి పోవాల్సిందే. ఆ ఊరిలో మట్టి గోడలు, పెంకలతో నిర్మించుకున్న ఇండ్లలో 56 మంది జీవిస్తున్నారు. వీరిలో 12 ఫ్యామిలీలు ఉన్నాయి. 16 మంది స్టూడెంట్స్, ఆరుగురు బ్రహ్మచారులున్నారు. వీరు సొంతంగా పనులు చేసుకోవడంతో పాటు రసాయనాలు లేకుండా పంటలు పండించుకొని బతుకుతున్నారు. కరెంట్ లేదు. ఫోన్, స్మార్ట్ఫోన్ సౌకర్యం కూడా లేదు. భక్తి వేదాంతస్వామి ప్రభుపాదుల ఆదేశంతో 2018లో ఈ గ్రామం ఏర్పడింది. కృష్ణ చైతన్య సమాజంలో సాగుతోంది. హిందీ, తెలుగు, ఇంగ్లిష్ భాషలు వస్తాయి. ఆధ్యాత్మికత జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి జీవితం మనం గడప గలుగుతామా..? ఈ గ్రామానికి సంబంధించిన వార్తను ఈనాడు పేపర్ కవర్ చేసింది.
- breaking news
- Fashion
- Street Fashion
- ఎడ్యుకేషనల్/జాబ్స్
- జాతీయం
- తాజా వార్తలు
- తెలంగాణ/ఆంధ్రప్రదేశ్
- భక్తి
- మీడియా
- సినిమా
- రివ్యూస్
- హిస్టరీ