కేసీఆర్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. నిజా నిజాల సంగతి పక్కన పెడితే ఆయన మాట ఎంత గట్టిగా మాట్లాడుతారో ఎరికే. కేసీఆర్ మాట్లాడినంత వరకూ అన్నీ నిజమే అన్పిస్తాయి. ఆ తర్వాత నిఝంగా ఇలా జరిగిందా.? జరుగుతుందా..? అన్న సంక్లిష్ట అనుమానాలు కలుగుతాయి. ఆడేదీ రాజకీయ చదరంగం కాబట్టి.. నిందలు వేయడం.. వేసుకోవడం సహజాది..సహజం. సరే విషయానికొస్తే నిన్న మహబూబ్నగర్లో కలెక్టరేట్ ప్రారంభం, ఆ తర్వాత జరిగిన మీటింగ్లో కేసీఆర్ విశ్వరూపం ప్రదర్శించారు. ఎవరికీ తెలియని.. హెచ్చరికను బయట పెట్టారు. ‘కేసీఆర్ నీ సర్కార్ను కూలగొడ్తా’ అని మోదీ అన్నట్టుగా చెప్పారు. ఎప్పడన్నారని ఆలోచించినా ఊహకు అందలేదు. అర్రె అప్పుడు గుర్తొచ్చింది.. మొన్న నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం విషయం. దీంట్ల మోదీ ఎప్పుడు మాట్లాడారన్నదైతే అంతు చిక్కలేదు. డైరెక్ట్గా లేకుంటే ఇండైరెక్ట్గా అన్నారా…? ఎప్పుడు అన్నది.. ఓ మిలియన్ ప్రశ్న. కానీ పశ్చిమబెంగాల్ ముఖమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి మోదీ ఓ మారు అన్నట్టుగా చూశాం. అక్కడ మమతను అన్నారు కాబట్టి తనను కూడా అన్నారని కేసీఆర్ అనుకున్నారా..? లేకుంటే కేసీఆర్తో మోదీ ల్యాండ్లైన్ ఫోన్లో మాట్లాడితే.. అప్పుడేమైనా ‘కేసీఆర్ నీ సర్కార్ను కూలగొడ్తా’ అని అన్నారా… ? అని ఉండవ్చు. ఏం జరిగిందో మనకైతే తెలియదు కానీ మోదీ అన్నారని కేసీఆర్ అన్నారు. మనం విన్నాం అంతే.
- breaking news
- Tech
- Entertainment
- Politics
- కామెడి
- క్రైమ్
- జాతీయం
- తాజా వార్తలు
- తెలంగాణ/ఆంధ్రప్రదేశ్
- మీడియా
- సినిమా
- రివ్యూస్