Home breaking news తెలంగాణ రాజకీయాల్లో పిడకల వేట.. అంటే ఇదే

తెలంగాణ రాజకీయాల్లో పిడకల వేట.. అంటే ఇదే

128
0

ఒకప్పుడు అంటే ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ‘రామాయణంలో పిడకల వేట’ అంటూ కామెంట్లు వినపడుతూ ఉంటాయి. అంతెందుకు మురళీమోహన్​, దీప హీరో హీరోయిన్లుగా 1980 లో రామాయణంలో పిడకల వేట సినిమా కూడా వచ్చింది. అసలీ పిడకల వేట గోలెందుకు అనుకుంటున్నారా..? ఏం లేదు. ఏదైన సీరియస్​ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు మధ్యలో మరో విషయం ప్రస్తావిస్తే ‘రామాయణంలో పిడకల వేట’ అంటూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్​ దర్యాప్తు జరుగుతోంది. కవితను అదే కేసీఆర్​ కూతురు. ఆమెను కూడా పార్టీ మారాలని బీజేపీ వాళ్లు కోరినట్టుగా స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మధ్యలో ఎంపీ ధర్మపురి అరవింద్​ వచ్చి కవితే ఏఐసీసీ ప్రెసిడెంట్​ మల్లికార్జున్​ ఖర్గేను అప్రోచ్​ అయ్యిందంటూ స్టేట్​మెంట్లు ఇచ్చాడు. ఈ స్టేట్​మెంట్​ విన్న కవితకు కోపమొచ్చేసీ ‘ఏయ్​ అర్వింద్​ నిజామాబాద్​ చౌరస్తాలో చెప్పుతో కొడతా’ అంటూ సీరియస్​ వార్నింగ్​ ఇవ్వడం, ఆ వెంటనే ఎంపీ అర్వింద్​ ఇంటిపై దాడి జరిగిపోయింది. అర్వింద్​ మామూలోడేం కాదుగా.. ఆయన మాటల మరాఠీ. నీకు బీజేపీ వాళ్లు ఫోన్​ చేశారని మీ అయ్య అదే కేసీఆర్​ అంటే చప్పుడు చేయవు కానీ నేను అంటే తిట్టి.. నా ఇంటి మీద దాడి  చేయిస్తవా.? అంటూ కౌంటర్​ ఇచ్చారు. ఈ మధ్యలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి జోక్యం చేసుకొని కేసీఆర్​ కుటుంబాన్ని బీజేపీలో చేర్చుకోమని అని స్టేట్​మెంట్​ ఇస్తే..  మరో కేంద్రమంత్రి ప్రహ్లాద్​ జోషి మాత్రం కేటీఆర్​, కవిత వస్తే బీజేపీలో చేర్చుకుంటామంటారు. మధ్యలో రేవంత్​రెడ్డి కల్పించుకొని అసలు కవితతో మాట్లాడిన బీజేపీ లీడర్లు ఎవరన్న స్టేట్​మెంట్​ నమోదు చేయాలని అంటున్నాడు. అసలు కవితను కాంగ్రెస్​లోకి ఆహ్వానించలేదంటూ చెప్పుకొచ్చాడు. ఏదీ ఏమైనా ఎమ్మెల్యేల కొనుగోలులో నిజమెంతో అబద్ధమెంతో కానీ ఈ పిడకల వేట మాత్రం సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here