Home breaking news మునుగోడు ఖర్చు మరీ పెరిగిపోయిందే

మునుగోడు ఖర్చు మరీ పెరిగిపోయిందే

155
0
Money politics in Munugode by-elections

దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఎన్నికగా మునుగోడు రికార్డ్​ సాధించింది. దీంతో పాటు అతి ఖరీదైన ఎన్నికగా మునుగోడు నిలిచిపోనుంది. ప్యాకేజీలను బట్టి టీఆర్​ఎస్​ నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి టీఆర్​ఎస్​కు సర్పంచ్​లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు మారుతూనే ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో స్థాయి అంటే లక్షల్లోనే రేటు నిర్ణయించి పార్టీలో చేర్చుకుంటున్నారు. చేరిన తర్వాత ప్యాకేజీ పెరిగితే మళ్లీ చేరుతూనే ఉన్నారు. ఇటువంటి ఎన్నిక ఇప్పటివరకూ దేశంలో ఎక్కడా జరగలేదు. ఇకముందు జరిగే అవకాశం మాత్రం ఉంటుంది. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్​ఎస్​, బీజేపీ ఫుల్​గా ఖర్చు పెడుతుండగా కాంగ్రెస్​ లిమిట్​గా ఖర్చు చేస్తోంది. టీఆర్​ఎస్​ కమ్యూనిటీ హాల్స్​ పేరుతో ఒక్కొక్కదానికి రూ.12 లక్షలు నిర్ణయించి ఇచ్చేస్తున్నారు. అంటే టోకున కులాల ఓట్లు కొంటున్నారు. మళ్లా ఇంటింటి ఖర్చు వేరే. ఎటూ చూసినా బీజేపీ, టీఆర్​ఎస్​ పెట్టే ఖర్చు వందల కోట్లలోనే ఉంటుందని అనధికార సమాచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here