రెగ్యులర్ పాలిట్రిక్స్ వేరు.. ఎలక్షన్ పాలిట్రిక్స్ వేరు. రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలిచి.. పవర్ చేజిక్కించుకోవడం.. ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవడమే ఎలక్షన్ పాలిట్రిక్స్. ఈ పాలిట్రిక్స్ను కరెక్ట్గా అర్థం చేసుకున్న కేసీఆర్.. సక్సెస్ అవుతున్నాడు. దుబ్బాక, జీహెచ్ఎంసీలో ఓడిపోయారుగా అనొచ్చు. అతి విశ్వాసంతో అక్కడ ఓడిపోయాడు కాబట్టే.. తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలిచి నిలిచాడు. ఈ ఎలక్షన్ పాలిట్రిక్స్లో సక్సెస్గా నిలుస్తూ ప్రతిపక్షాలకు అందనంత ఎత్తుకు వెళ్లాడు. ఇప్పుడు అందరి దృష్టి హుజురాబాద్ ఉప ఎన్నికలపైనే. ఈ ఎన్నికల్లో గెలిచితీరాల్సిన అత్యవసర పరిస్థితి కేసీఆర్ది. అందుకే సీరియస్గానే తీసుకున్నాడు. దళితబంధు అనే స్కీం ప్రవేశపెట్టాడు. ఈ స్కీం దెబ్బకు ప్రతిపక్షాలకు కండ్లు బైర్లు కమ్మేశాయి. ఇదంతా ఎన్నికల కోసమే అంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు. కొందరు ఎన్నికల కమిషన్కు వెళ్లడం జరిగిపోయాయి.
ఈ పరిణామల క్రమంలో తాను దత్తత తీసుకున్న యాదాద్రి జిల్లా వాసాలమర్రి అనే చిన్న ఊరిలోని 76 కుటుంబాలకు ఈ దళితబంధు స్కీం అమలు చేస్తున్నట్టుగా ప్రకటించాడు. 7.60 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేశారు. అంటే స్టేట్ లెవల్లో దళితబంధు స్కీం అఫిషీయల్గా ప్రారంభమైనట్టే. ఒక్క హుజురాబాద్ కోసమే అంటూ గాయిగాయి చేస్తున్న ప్రతిపక్షాలను ఈరకంగా దెబ్బకొట్టేశాడు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా.. దళితబంధు స్కీంను హుజురాబాద్లో అమలు చేయొచ్చు. అంటే అఫిషియల్గా ఇంటికి 10 లక్షలు బహిరంగంగానే ఇస్తూ 40 వేల ఎస్సీల ఓట్లు కొనేయొచ్చు. ఎన్ని నీతులు చెప్పుకున్నా.. పది లక్షలంటే ఎవరికి చేదు. ఓటింగ్ టైముకు కొందరికి అందకున్నా.. స్కీమే కాబట్టి తరవాత వస్తాయని చెప్పొచ్చు. . టీఆర్ఎస్ అభ్యర్థి గెలవకుంటే.. ఈ పది లక్షల స్కీం ఆగిపోతుందని క్యాడర్తో ప్రచారం చేయొచ్చు. నోటిఫికేషన్ కంటే ముందుగానే.. రాష్ట్రంలో స్కీం అమలు ప్రారంభమైంది కాబట్టి.. ఎన్నికల కమిషన్ కూడా ఏం చేయలేదు. అప్పుడెప్పుడో ఇస్తానని చెప్పిన 57 ఏండ్లు ఉన్నోళ్లకు పించన్.. అమలు చేస్తున్నట్టు ప్రకటించేశాడు. ఇదో ఓట్ల కొనుగోలు స్కీం. లొల్లి పెట్టడం తప్ప ప్రతిపక్షాలు ఏం చేయలేవు. చేసే అవకాశం అంతకన్నా లేదు.