ఇండియన్ ఆర్మీలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ–2021 గాను 57వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్, పురుషులు), 28వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్, మహిళలు) కోర్సుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిన పెండ్లికాని పురుషులు, మహిళలు, డిఫెన్స్ పర్సనల్ విడోస్ నుంచి అప్లికేషన్లు కోరుతోంది.
ఖాళీలు: పోస్టుల సంఖ్య 191, (ఎస్ఎస్సీ(టెక్) మెన్: 175; ఎస్ఎస్సీ(టెక్) ఉమెన్: 14; విడోస్ డిఫెన్స్ పర్సనల్: 02)
కేటగిరీలు: సివిల్/బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్.
అర్హతలు: ఎస్ఎస్సీ (టెక్) పురుషులు/మహిళలు –సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. ఎస్ఎస్సీ విడోస్(నాన్ టెక్నికల్),(నాన్ యూపీఎస్సీ): ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్ఎస్సీ(విడో) టెక్నికల్: బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఏజ్: ఎస్ఎస్సీ (టెక్) పురుషులు/మహిళలు –01.10.2021 నాటికి 20–27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్ఎస్సీ విడోస్(నాన్ టెక్నికల్),(నాన్ యూపీఎస్సీ); ఎస్ఎస్సీ (విడో) టెక్నికల్: 01.10.2021 నాటికి 35 ఏండ్లలోపు ఉండాలి.
ఆన్లైన్ మే 25 నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 23.06.2021 నాటికి అప్లికేషన్ చేసుకోవాలి. ఎంపిక: ఎస్ఎస్బీ ఇంటర్వూ్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.ఫుల్ డిటైల్స్ కోసం: http://joinindianarmy.nic.in